దేవినేని ఉమపై దాడి అమానుషం: చినరాజప్ప

ABN , First Publish Date - 2021-07-28T16:13:10+05:30 IST

టీడీపీ నేత దేవినేని ఉమపై దాడి అమానుషమని నిమ్మకాయల మాజీ మంత్రి చినరాజప్ప అన్నారు.

దేవినేని ఉమపై దాడి అమానుషం: చినరాజప్ప

విజయవాడ: టీడీపీ నేత దేవినేని ఉమపై దాడి అమానుషమని మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ గూండా రాజకీయాలను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. ఒక్కరిపై 100 మంది దాడి పిరికిపింద చర్యగా అభివర్ణించారు. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ప్రోద్భలంతోనే దేవినేని ఉమపై దాడి జరిగిందని ఆరోపించారు. అవినీతి, అక్రమాలను అడ్డుకుంటే దాడులకు పాల్పడతారా? అని ప్రశ్నించారు. ప్రజా సంపదను వైసీపీ నేతలు దోచుకుంటుంటే అడ్డుకోవడం తప్పా? అని నిలదీశారు. రాష్ట్రంలో మాజీ మంత్రికే రక్షణ లేకుంటే సామాన్యుల పరిస్థితేంటని చినరాజప్ప తీవ్రస్థాయిలో మండిపడ్డారు.


మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై వైసీపీ కార్యకర్తలు దాడిచేశారు. రాళ్లు, కర్రలతో విరుచుకుపడ్డారు. ఈ దాడిలో ఆయన కారు కొంత దెబ్బతినగా... వెనుకే ఉన్న మరో టీడీపీ నేత కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. మంగళవారం రాత్రి కృష్ణా జిల్లా జి.కొండూరు మండలం గడ్డమణుగులో ఈ దాడి జరిగింది. ఆ తర్వాత జి.కొండూరు ఠాణా వద్ద రాత్రి పొద్దుపోయే దాకా ఉద్రిక్తత కొనసాగింది. 

Updated Date - 2021-07-28T16:13:10+05:30 IST