శ్రీలంకలో లంగరేసిన చైనా గస్తీ నౌక

ABN , First Publish Date - 2022-08-04T11:04:16+05:30 IST

శ్రీలంక సముద్రతీరంలో చైనాకు చెందిన ‘యువాన్‌ వాస్‌’ అనే భారీ గస్తీ నౌక లంగరేసింది. దీంతో భారత నౌకాదళం అప్రమత్తమైంది.

శ్రీలంకలో లంగరేసిన చైనా గస్తీ నౌక

చెన్నై, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): శ్రీలంక సముద్రతీరంలో చైనాకు చెందిన ‘యువాన్‌ వాస్‌’ అనే భారీ గస్తీ నౌక లంగరేసింది. దీంతో భారత నౌకాదళం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా తమిళనాడులోని సముద్రతీర ప్రాంతాల్లో నిఘా పెట్టింది. అదే సమయంలో కల్పక్కం, కూడంకుళం అణువిద్యుత్‌ కేంద్రాల వద్ద భద్రతను కూడా పెంచారు. ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలోని అమ్మాందోటై హార్బర్‌కు చైనా గస్తీ నౌక సోమవారం చేరుకుంది. 

Updated Date - 2022-08-04T11:04:16+05:30 IST