Xi Jinping House Arrest?: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ హౌస్ అరెస్ట్! సుబ్రహ్మణ్య స్వామి ట్వీట్‌తో కలకలం

ABN , First Publish Date - 2022-09-25T01:52:35+05:30 IST

బీజింగ్: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ (Chinese President Xi Jinping)కు వ్యతిరేకంగా తిరుగుబాటు జరిగిందని,

Xi Jinping House Arrest?: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ హౌస్ అరెస్ట్! సుబ్రహ్మణ్య స్వామి ట్వీట్‌తో కలకలం

బీజింగ్: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ (Chinese President Xi Jinping)కు వ్యతిరేకంగా తిరుగుబాటు జరిగిందని, చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (People’s Liberation Army) పీఎల్‌ఏ చీఫ్ పదవి నుంచి ఆయన్ను తొలగించి హౌస్ అరెస్ట్ (house arrest) చేశారంటూ నెట్టింట పుకార్లు షికారు చేస్తున్నాయి. అంతేకాదు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ జనరల్  లి కియోమింగ్‌ (General Li Qiaoming)ను చైనా అధ్యక్షుడిగా చేశారంటూ సోషల్ మీడియా(social media) లో పోస్టులు వైరల్ అవుతున్నాయి. 





బీజింగ్‌లోకి సైన్యం వాహనాలు ప్రవేశించాయని, అనేకమంది అధికారులను అరెస్ట్ చేశారంటూ కొందరు పోస్టులు పెట్టారు. ఎక్కడ చూసినా పొగ అలుముకుందని, చైనా అస్థిరంగా మారిందంటూ తమ పోస్టులకు కామెంట్లు పెడుతున్నారు.   





బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి (Subramanian Swamy) కూడా జిన్‌పింగ్‌ హౌస్ అరెస్ట్‌పై ట్వీట్ చేశారు. అయితే పుకార్లను చెక్ చేసుకోవాలని ఆయన సూచించారు. 





మరోవైపు చైనా కమ్యూనిస్ట్ పార్టీ (Chinese Communist Party) కానీ, చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ పీఎల్‌ఏ కానీ ఈ పుకార్లను ఖండించలేదు. 


ఉజ్బెకిస్థాన్ సమర్కండ్‌లో ఇటీవల జరిగిన షాంఘై సహకార సంఘం (Shanghai Cooperation Organisation) సమావేశాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (prime minister narendra modi) చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మాట్లాడలేదు. కన్నెత్తి కూడా చూడలేదు. కరచాలనం కూడా చేయలేదు. కేవలం గ్రూప్ ఫొటో మాత్రం దిగారు. అయితే ఆ గ్రూప్‌ ఫొటోలో అతి సమీపంలోనే ఉన్నా జిన్‌పింగ్ మోదీ మాట్లాడలేదు. సమావేశాల్లోని మిగతా సందర్భాల్లోనూ మోదీ ఆయనకు అతి సమీపంగా ఉన్నా మాట్లాడలేదు. 


2020 జూన్‌ 15న గల్వాన్ లోయ (galwan valley)లో చైనా సైన్యం కుట్రపూరితంగా చేసిన దాడిలో కల్నల్ సంతోష్ సహా 20 మంది భారత జవాన్లు చనిపోయారు. భారత సైన్యం నాడు జరిపిన ప్రతిదాడుల్లో చైనా సైనికులు కూడా పెద్ద సంఖ్యలో చనిపోయారు. అయితే ఎంతమంది చనిపోయారనేది చైనా ఇప్పటివరకూ అధికారికంగా ప్రకటించలేదు. గల్వాన్ ఘటన జరిగిన వెంటనే నరేంద్ర మోదీ ప్రభుత్వం చైనా యాప్‌లను నిషేధించింది. చైనాతో వ్యాపార, వాణిజ్య సంబంధాలను ఆపివేసింది. నాటి నుంచి ఉద్రిక్తతలు తగ్గించేందుకు భారత్, చైనా సైన్యాల మధ్య చర్చలు మాత్రం జరుగుతున్నాయి. ఇవన్నీ ఒకెత్తు అయితే చైనా తీరులో భారత్ కోరుకున్న మార్పు రాకపోవడంతో మోదీ జిన్‌పింగ్‌తో మాట్లాడలేదని తెలుస్తోంది. షాంఘై సహకార సంఘం సమావేశాల సందర్భంగా మోదీ జిన్‌పింగ్‌ను పట్టించుకోకపోవడం కలకలం రేపింది.  


Updated Date - 2022-09-25T01:52:35+05:30 IST