మంత్రాలయంలో చిన్న జీయర్ స్వామి
ABN , First Publish Date - 2021-01-17T04:46:40+05:30 IST
త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి శనివారం రాత్రి మంత్రా లయానికి చేరుకున్నారు.
మంత్రాలయం, జనవరి 16: త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి శనివారం రాత్రి మంత్రా లయానికి చేరుకున్నారు. ఆదివారం పర్యటనను మఠం పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు చేతుల మీదుగా ప్రారంభించి మండల పరిధిలోని సూగూరు, బూదూరు, వగరూరు గ్రామాల మీదుగా పర్యటన సాగుతు న్నట్లు వీహెచ్పీఎస్ నాయకులు తెలిపారు.
ఆదోనిటౌన్: ఆదోని పట్టణంలో ఆదివారం పాతబస్టాండు ప్రాంతంలోని ఫ్రైఓవర్ బ్రిడ్జి ప్రాంతంలో ఉన్న ఆంజనేయస్వామి దేవాలయాన్ని చిన్న జీయర్ స్వామి సందర్శిస్తారు. ఎమ్మిగనూరు రోడ్డులో ఉన్న బైపాస్ రోడ్డు ప్రాంతంలోని 41 అడుగుల ఎత్తు ఉన్న అజేయ ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు చేస్తారు. సాయంత్రం బైపాస్ రోడ్డులో ఉన్న కౌస్తుభం నివాసంలో పట్టణ ప్రముఖులతో ఆధ్యాత్మిక విషయాలపై చర్చిస్తారు. సోమవారం ఉదయం 10 గంటలకు కొత్తబస్టాండు ప్రాంతంలోని చేకూరి ఫంక్షన్హాల్లో ఆదోని మండలంలోని అన్ని దేవాలయాలకు సంబంధించిన నిర్వాహకులతో జరిగే సమావేశంలో వారికి మార్గదర్శనం నిర్వహిస్తారు. మండలంలోని వివిఽ ద ఆలయాలకు సంబంధించిన నిర్వాహకులు, పూజారులు, పెద్దలు హాజరు కావాలని మాజీ ఎమ్మెల్యే ప్రకాష్జైన్, మళేకార్ శ్రీనివాస్ తెలిపారు.