జగన్‌కు చిరంజీవి దండం పెట్టడం బాధనిపించింది: జేసీ

ABN , First Publish Date - 2022-02-24T21:56:27+05:30 IST

సినీ పరిశ్రమ కోసం సీఎం జగన్‌కు నటుడు చిరంజీవి దండం పెట్టడం బాధ కల్గించిందని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

జగన్‌కు చిరంజీవి దండం పెట్టడం బాధనిపించింది: జేసీ

అనంతపురం: సినీ పరిశ్రమ కోసం సీఎం జగన్‌కు నటుడు చిరంజీవి దండం పెట్టడం బాధ కల్గించిందని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్  జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని పరిశ్రమలు బ్రతికే పరిస్థితి లేదన్నారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై జగన్ ప్రభుత్వం కక్ష సాధిస్తోందని దుయ్యబట్టారు. జగన్ చర్యలతో పవన్‌కు ఏం కాదు.. నిర్మాతలకే ఇబ్బందని తెలిపారు. పవన్‌ను ఏం చేయలేక.. సినిమా వారిపై పడ్డారా? అని ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నించారు. ఇంకెంతమందిని జగన్‌రెడ్డి వేధిస్తారని నిలదీశారు. టీటీడీ రేట్లు ఎందుకు పెంచుతున్నారు? అని ప్రశ్నించారు. దేవస్థానం మీ అబ్బసొత్తు కాదు.. పేదలు తిరుపతికి రావద్దా? అని మరోసారి ప్రశ్నించారు. జగన్‌రెడ్డి.. ఇకనైనా ధరల పెంపు మానుకోవాలని  ప్రభాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు.

Updated Date - 2022-02-24T21:56:27+05:30 IST