రాజ్యసభ ఆఫర్ వార్తలను తోసిపుచ్చిన చిరంజీవి
ABN , First Publish Date - 2022-01-14T22:15:27+05:30 IST
వరుసగా రెండో రోజు మెగాస్టార్ చిరంజీవి విజయవాడకు వచ్చారు. ఈ సందర్భంగా చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
అమరావతి: వరుసగా రెండో రోజు మెగాస్టార్ చిరంజీవి విజయవాడకు వచ్చారు. ఈ సందర్భంగా చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. చిరంజీవిని వైసీపీ ప్రభుత్వం రాజ్యసభకు పంపబోతోందనే ప్రచారం జరుగుతోంది. రాజ్యసభ ఆఫర్ వార్తలను ఆయన తోసిపుచ్చారు. తాను రాజకీయాలకు పూర్తి దూరమని స్పష్టం చేశారు. వైసీపీ తనకు రాజ్యసభ ఆఫర్ చేసిందని వస్తున్న వార్తలు అవాస్తవమని కొట్టిపారేశారు. వైసీపీ తనకు రాజ్యసభ ఇస్తానన్నది ఊహాజనితమేనని వ్యాఖ్యానించారు. రాజకీయాలకు తాను అతీతమని తెలిపారు. రాజకీయాలకు దూరంగా ఉన్న తనకు ఇలాంటి ఆఫర్లు రావని చెప్పారు. ఇలాంటి ఆఫర్లను తాను కోరనని ప్రకటించారు. అటువంటి వాటికి తాను దూరమని చిరంజీవి స్పష్టం చేశారు.