నాకొక్కడికే సీఎంవో నుంచి ఆహ్వానం.. ఎవరెవరొస్తున్నారో తెలియదు : చిరు సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-02-10T16:59:30+05:30 IST

అంతటితో ఆగని ఆయన.. సంచలన వ్యాఖ్యలే చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ వ్యాఖ్యలు అటు సినీ ఇండస్ట్రీలో..

నాకొక్కడికే సీఎంవో నుంచి ఆహ్వానం.. ఎవరెవరొస్తున్నారో తెలియదు : చిరు సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్ సిటీ/అమరావతి : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో టాలీవుడ్ ప్రముఖుల భేటీ మరికాసేపట్లో జరగనుంది. ఇప్పటికే విజయవాడకి సినీ ప్రముఖుల బృందం బయల్దేరి వెళ్లింది. మెగాస్టార్ చిరంజీవి బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి పయనమై విజయవాడ చేరుకున్నారు. అయితే.. బేగంపేటలో మీడియాతో మాట్లాడిన చిరు సంచలన వ్యాఖ్యలే చేశారు. టాలీవుడ్ సమస్యలకు ఎండ్ కార్డు కాదని.. ఇవాళ శుభం కార్డు పడుతుందని చిరు చెప్పుకొచ్చారు. అంతటితో ఆగని ఆయన.. సంచలన వ్యాఖ్యలే చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ వ్యాఖ్యలు అటు సినీ ఇండస్ట్రీలో.. ఇటు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి.


ఇంతకీ చిరు ఏమన్నారు..!?

మేము మాట్లాడాలని అనుకున్నది, చెప్పాలనుకున్నదంతా నిశితంగా ముఖ్యమంత్రికి వివరిస్తాం. భేటీ ముగిసిన అనంతరం మీడియా సమావేశంలో అన్ని విషయాలు వివరిస్తాం. సీఎంవో నుంచి నాకొక్కడికే ఆహ్వానం ఉందని తెలిసింది. నాతోపాటు ఎవరొస్తున్నారో నాకు తెలియదు.. నేను కూడా మీడియాలో మీ ద్వారా విషయం తెలుసుకున్నాను. మిగతా విషయం సీఎంవోకు మాత్రమే తెలుసు. దట్స్ ఆల్.. థ్యాంక్యూ’ అని చెప్పి చిరంజీవి ఫ్లైట్ ఎక్కడానికి వెళ్లిపోయారు.


ఎవరెవరు వెళ్లారు..!?

అయితే.. రెండు మూడ్రోజులుగా చిరంజీవి వెంట ఫలానా వాళ్లంతా వెళ్తుతన్నారని మీడియాలో పెద్ద ఎత్తు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. చిరు వ్యాఖ్యలపై ఇండస్ట్రీ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో తెలియాల్సి ఉంది. కాగా.. మహేష్‌బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ, నిరంజన్‌రెడ్డితో పాటు పలువురు సినీ ప్రముఖులు విజయవాడకు వెళ్లారు. మరోవైపు.. ఇప్పటికే ఆర్‌.నారాయణమూర్తి, అలీ, పోసాని విజయవాడ చేరుకున్నారు. కాసేపట్లో సీఎం క్యాంప్‌ ఆఫీస్‌కి  సినీ బృందం వెళ్లనున్నది.


Updated Date - 2022-02-10T16:59:30+05:30 IST