Chittoor: అమ్మఒడి కార్యక్రమంలో గందరగోళం
ABN , First Publish Date - 2022-06-27T18:23:43+05:30 IST
జిల్లాలోని నాగయ్య కళాక్షేత్రంలో జరిగిన అమ్మ ఒడి కార్యక్రమం గందరగోళం నెలకొంది.
చిత్తూరు: జిల్లాలోని నాగయ్య కళాక్షేత్రంలో జరిగిన అమ్మ ఒడి కార్యక్రమం గందరగోళం నెలకొంది. విద్యుత్ సరఫరా లేకపోవడంతో అమ్మ ఒడి కార్యక్రమానికి అంతరాయం ఏర్పడింది. చివరకు అంధకారంలోనే అమ్మ ఒడి కార్యక్రమాన్ని అధికారులు కొనసాగించారు. కాగా... సమావేశం వేదిక వద్దకు కలెక్టర్ రావడంతో అధికారులు స్పందించారు. విద్యుత్ సరఫరా ఇవ్వడంతో అమ్మఒడి కార్యక్రమం ఆలస్యంగా మొదలైంది.