Chittoor: గంట పాటుగా నిలిచిన రైళ్లు

ABN , First Publish Date - 2022-04-22T13:31:22+05:30 IST

చెన్నై- బెంగళూరు రైలు మార్గంలో ఆంధ్ర-కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల్లో కుప్పం సమీపంలోని బిసనాథం వద్ద సిగ్నల్ వ్యవస్యలో సమస్య ఏర్పడింది.

Chittoor: గంట పాటుగా నిలిచిన రైళ్లు

చిత్తూరు: చెన్నై- బెంగళూరు రైలు మార్గంలో ఆంధ్ర - కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల్లో కుప్పం సమీపంలోని బిసనాథం వద్ద సిగ్నల్ వ్యవస్యలో సమస్య ఏర్పడింది. దీంతో ఒక గంట సమయంగా రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఆంధ్ర రాష్ట్ర సరిహద్దుల్లో చెన్నై-బెంగళూర్ లాలబాగ్ ఎక్స్‌ప్రెస్, గుడుపల్లిలో చెన్నై-మైసూర్ శతాబ్ది, కుప్పంలో చెన్నై-మైసూర్ ఎక్స్‌ప్రెస్, వరదపురంలో భంగళూరు కుప్పం పుష్ఫుల్, బంగారుపేట్‌లో భంగళూర్ - కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్, మాలర్‌లో మైసూర్ - తిరుపతి ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగిపోయాయి. విషయం తెలిసిన వెంటనే రైల్వే సిబ్బంది హుటాహుటిన సమస్యను పరిష్కరించేందుకు బిసనాథం చేరుకున్నారు.

Updated Date - 2022-04-22T13:31:22+05:30 IST