ఎంపీటీసీ ఎన్నికల్లోనూ YCP నాయకుల అరాచకాలు
ABN , First Publish Date - 2021-11-16T17:53:57+05:30 IST
వైసీపీ ఎన్నికల్లో అధికార పార్టీ నాయకులు అరాచకాలు సృష్టిస్తున్నారు.
చిత్తూరు: వైసీపీ ఎన్నికల్లో అధికార పార్టీ నాయకులు అరాచకాలు సృష్టిస్తున్నారు. ఎస్ఆర్పురం మండలం వివిపురం ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్లో స్థానిక వైసీపీ నాయకుడు హల్ చల్ చేశాడు. పోలీసులపై వైసీపీ నాయకులు తిరగబడ్డారు. ‘‘నా స్థాయి ఏంటో తెలుసా.. చిన్న సాయి వ్యక్తుల వద్ద నన్ను అలా మాట్లాడుతారు ఏమి... 16 సార్లు జైలుకి వెళ్ళొచ్చా.. నాకు ఇది కొత్త కాదు... మీరు లోపల వేస్తే నేను బయటకు వస్తా... వేస్తారా వేయండి చూద్దాం’’ అంటూ పోలీసులతో వైసీపీ నాయకుడు దౌర్జన్యానికి దిగారు.