Chittoor: టీడీపీ తెలుగు యువత కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తం
ABN , First Publish Date - 2022-02-10T17:15:18+05:30 IST
టీడీపీ తెలుగు యువత, విద్యార్థి సంఘాలు చేపట్టిన చిత్తూరు కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది.
చిత్తూరు: టీడీపీ తెలుగు యువత, విద్యార్థి సంఘాలు చేపట్టిన చిత్తూరు కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని భగ్నం, విఫలం చేసేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడకక్కడ ముందస్తుగా అరెస్ట్ చేశారు. పోలీసుల అడ్డుకట్ట నుండి తప్పించుకుని టీడీపీ నాయులు కలెక్టరేట్కు చేరుకున్నారు. రాష్ట్ర టీడీపీ తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు, చిత్తూరు పార్లమెంట్ తెలుగు యువత అధ్యక్షులు కాజూరు రాజేష్ ,తిరుపతి పార్లమెంట్ తెలుగు యువత అధ్యక్షులు రవి నాయుడు లతోపాటు పలువురు ముఖ్య నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు.
అరెస్ట్ చేసిన నాయకులను ఒక్కొక్కరిని ఒక్కో ప్రాంతంలోని పోలీస్ స్టేషన్లకు బలవంతంగా తరలించారు. కలెక్టరేట్లోకి చొచ్చుకుపోవడానికి ప్రయత్నించిన ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు ఆందోళనకారులకు మధ్య తీవ్రమైన తోపులాట ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసుల చర్యలపై ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్ డౌన్ డౌన్ అంటూ కలెక్టరేట్ వద్ద ఆందోళనకారులు నినాదాలు చేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి రహదారులోనూ ప్రత్యేకమైన పోలీసు చెక్పోస్టుల ఏర్పాటు చేసి కలెక్టరేట్ ముట్టడికి రానివ్వకుండా ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. చిత్తూరు కలెక్టరేట్కు వెళ్లే నాలుగు రోడ్డు మార్గాలను పోలీసులు దిగ్బంధం చేశారు.