అప్పు చెల్లించలేదని దళితుడిని కులం పేరుతో దూషిస్తూ....దారుణం

ABN , First Publish Date - 2022-03-01T17:37:23+05:30 IST

డిప్యూటీ సీఎం నారాయణ స్వామి నియోజకవర్గంలో దళితులకు రక్షణ కరువైంది.

అప్పు చెల్లించలేదని దళితుడిని కులం పేరుతో దూషిస్తూ....దారుణం

చిత్తూరు: డిప్యూటీ సీఎం నారాయణ స్వామి నియోజకవర్గంలో దళితులకు రక్షణ కరువైంది. ఈశ్వర్ రెడ్డి అనే వ్యక్తి పది వేలు బాకీ చెల్లించలేదని దళితుడిని కాళ్లు, చేతులు విరిచేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దళితుల ప్రభుత్వం అంటూ పదే పదే మైకుల ముందు ఊదరగొట్టే నారాయణ స్వామిపై దళిత నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గంగాధర నెల్లూరు మండలం నందనూరు పంచాయతీ పెద్దకంటిపల్లి  గ్రామంలో చంద్రన్ అనే దళితుడిపై ఈ దాష్టీకానికి పాల్పడ్డారు. కలిజవేడు గ్రామానికి చెందిన ఈశ్వర్ రెడ్డి వద్ద తీసుకున్న పది వేలు అప్పు సకాలంలో చెల్లించలేదని దారుణానికి ఒడిగట్టారు. చంద్రన్‌ను ఈశ్వర్ రెడ్డి ద్విచక్ర వాహనంలో ఎక్కించుకుని తన మామిడి తోటలోకి తీసుకెళ్లి  దుర్భాషలాడుతూ, కులం పేరుతో దూషిస్తూ, విచక్షణ రహితంగా కొట్టి కాళ్ళు చేతులు విరిచాడు. ప్రస్తుతం బాధితుడు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై బాధితుడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

Updated Date - 2022-03-01T17:37:23+05:30 IST