చిత్తూరులో అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

ABN , First Publish Date - 2022-03-14T18:39:18+05:30 IST

రాత్రి పూట ఇండ్లకు కన్నం వేసి దొంగతనాలకు పాల్పడే ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.

చిత్తూరులో అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

చిత్తూరు: రాత్రి పూట ఇండ్లకు కన్నం వేసి దొంగతనాలకు పాల్పడే ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి నాలుగున్నర కేజీల వెండి, 45 గ్రాముల బంగారు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న చోరీ సొత్తు మొత్తం విలువ 20 లక్షలుగా గుర్తించారు. పట్టుబడిన దొంగలు ఇటీవల తవణంపల్లి, కాణిపాకం పరిసర ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడినట్లు నిర్ధారణ అయ్యింది. ఉంగుటూరు, తెనాలి తవణంపల్లి, కాణిపాకం ప్రాంతాల్లో చోరీకి గురైన సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 


Updated Date - 2022-03-14T18:39:18+05:30 IST