వైసీపీ నేతల వేధింపులతో వ్యక్తి ఆత్మహత్యాయత్నం...వీడియో వైరల్

ABN , First Publish Date - 2022-03-17T17:36:18+05:30 IST

వైసీపీ నాయకుల వేధింపులతో సెల్ఫీ వీడియో తీస్తూ మధు అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గామారింది.

వైసీపీ నేతల వేధింపులతో వ్యక్తి ఆత్మహత్యాయత్నం...వీడియో వైరల్

చిత్తూరు: వైసీపీ నాయకుల వేధింపులతో సెల్ఫీ వీడియో తీస్తూ మధు అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గామారింది. చిత్తూరు జిల్లా రొంపిచర్ల మండలం చల్లా వారి పల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వైసీపీ నాయకుడు చల్లా శ్రీనాథ్ రెడ్డి తనను వేధింపులకు గురి చేస్తున్నాడంటూ అదే గ్రామానికి చెందిన మధు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ వీడియో వైరల్ అయిన మరికొద్ది గంటల తర్వాత మరొక సెల్ఫీ వీడియోను మధు పోస్ట్‌ చేశాడు. శ్రీనాథ్ రెడ్డి తనను ఎలాంటి  వేధింపులకు గురి చేయలేదంటూ మధు మరో సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. అయితే వైసీపీ నాయకులు బలవంతంగా అతని ద్వారా ఈ సంఘటనలో సంబంధం లేదని సెల్ఫీ వీడియో తీశారా.. లేక మధునే సెల్ఫీ వీడియో తీసి తీసి పోస్ట్ చేశారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - 2022-03-17T17:36:18+05:30 IST