చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2021-11-05T21:12:18+05:30 IST

కుప్పం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో వైసీపీ నాయకులు రెచ్చిపోయారు.

చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు

చిత్తూరు జిల్లా: కుప్పం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో వైసీపీ నాయకులు రెచ్చిపోయారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్ది రెడ్డి సమక్షంలోనే వైసీపీ నేతలు బూతు పురాణం మొదలుపెట్టారు. చంద్రబాబుపై పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘చెత్త ఊడ్చడానికి కుప్పం వచ్చావా’ అంటూ తమిళంలో పరుషపదజాలంతో మాట్లాడారు. ఇటీవల వైసీపీ నాయకులు టీడీపీని టార్గెట్‌గా చేసుకుని విమర్శలు చేస్తున్నారు.

Updated Date - 2021-11-05T21:12:18+05:30 IST