కుప్పంలో టీడీపీ Vs వైసీపీ

ABN , First Publish Date - 2022-01-11T15:48:50+05:30 IST

చిత్తూరు జిల్లా: కుప్పంలో అధికార వైసీపీ రేపిన చిచ్చుతో ఘర్షణలు కొనసాగుతున్నాయి.

కుప్పంలో టీడీపీ Vs వైసీపీ

చిత్తూరు జిల్లా: కుప్పంలో అధికార వైసీపీ రేపిన చిచ్చుతో ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మీపురంలో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. సోషల్ మీడియాలో టీడీపీ వర్గాలకు వ్యతిరేకంగా వైసీపీ శ్రేణులు పోస్టులు చేశారు. ఇదేంటని ప్రశ్నించినందుకు టీడీపీ శ్రేణులపై ప్రతాపం చూపించారు. దీంతో ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో టీడీపీ కార్యకర్త లోకేష్, వైసీపీ కార్యకర్త మహేష్ గాయపడ్డారు. ఇద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-01-11T15:48:50+05:30 IST