సీఎం జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు, రోజాకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన తెలుగు మహిళలు

ABN , First Publish Date - 2022-03-18T20:22:05+05:30 IST

సీఎం జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు, రోజాకు చిత్తూరు తెలుగు మహిళలు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

సీఎం జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు, రోజాకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన తెలుగు మహిళలు

చిత్తూరు: ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి, వైసీపీ ఎమ్మెల్యేలు, నగిరి ఎమ్మెల్యే రోజాకు చిత్తూరు పార్లమెంటు తెలుగు మహిళ అధ్యక్షురాలు కర్జాల అరుణ, ప్రధాన కార్యదర్శి లక్ష్మి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కల్తీ సారా తాగిన భర్తలను పోగొట్టుకొని, తాళి బొట్టులు తెగి ఏడుస్తుంటే ఎమ్మెల్యేలు, రోజా మంత్రి పదవుల కోసం అసెంబ్లీలో సీఎంను పొగడ్తలతో ముంచెత్తుతున్నారని దుయ్యబట్టారు. రోజా తీరు, ప్రవర్తనలో మార్పు రాకుంటే వచ్చే ఎన్నికల్లో  మహిళలే ఆమెను ఇంటికి సాగనంపుతారన్నారు. బెల్టు షాపులను రద్దు చేసిన ఘనత టీడీపీదేనన్నారు. 2014లో తెలుగుదేశం పార్టీ రాష్ట్రాన్ని నాటు సారా రహిత రాష్ట్రంగా చేసిందన్నారు.


ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణస్వామి సొంత మండలంలో సయితం నాటుసారా ఏరులై పారుతోందని మహిళలు విమర్శించారు. మద్య నిషేధం పేరుతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం అక్రమ మద్యం, నాటు సారాతో కోట్లు సంపాదిస్తున్నారన్నారు. శవ రాజకీయాలు పుట్టిందే వైయస్ కుటుంబం నుంచని విమర్శించారు. బాబాయి వివేకాను గొడ్డలితో నరికేసి గుండె పాటుగా చిత్రీకరించి జగన్ నిజమైన శవ రాజకీయం చేశారన్నారు. తండ్రి వైఎస్ శవాన్ని పక్కన పెట్టుకొని ముఖ్యమంత్రి పదవి కోసం సంతకాలు సేకరించి శవ రాజకీయం చేయలేదా? అని  తెలుగు మహిళలు ప్రశ్నించారు. 

Updated Date - 2022-03-18T20:22:05+05:30 IST