చిత్తూరు జిల్లాలో కలకలం...బాలికను కిడ్నాప్ చేసిన వైసీపీ వాలంటీర్

ABN , First Publish Date - 2022-03-22T17:40:38+05:30 IST

చిత్తూరు జిల్లాలో మైనర్ బాలిక కిడ్నాప్ కలకలం రేపుతోంది. శాంతిపురం మండలం, నంజుంపేటలో...

చిత్తూరు జిల్లాలో కలకలం...బాలికను కిడ్నాప్ చేసిన వైసీపీ వాలంటీర్

చిత్తూరు: జిల్లాలో మైనర్ బాలిక కిడ్నాప్ కలకలం రేపుతోంది. శాంతిపురం మండలం, నంజుంపేటలో వైసీపీ వాలంటీర్ పదో తరగతి విద్యార్థినికి మాయ మాటలు చెప్పి కిడ్నీప్ చేశాడు. వడ్డువంక గ్రామానికి చెందిన గోవిందప్ప కుమారుడు వేణుగోపాల్ శివరామపురం గ్రామపంచాయితీలో వాలంటీర్‌గా పనిచేస్తున్నాడు. జనవరి 4న విద్యార్థినికి మాయ మాటలు చెప్పి కిడ్నాప్ చేశాడు. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 366ఏ కింద కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన జరిగి 80 రోజులు దాటినా ఇప్పటి వరకు విద్యార్థిని ఆచూకీ తెలియలేదు. విచారణ నిమిత్తం దారి ఖర్చులకుగానూ పోలీసులు బాలిక తల్లిదండ్రుల నుంచి రూ. 92వేలు తీసుకున్నారు.


వేణుగోపాల్‌కు వైసీపీ నేతల మద్దతు ఉండడంతో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ మహిళా నేతలు ఆరోపించారు. బాలిక తల్లిదండ్రులతో కలిసి ఏఎస్పీని కలిసి వినతి పత్రం ఇచ్చారు.

Updated Date - 2022-03-22T17:40:38+05:30 IST