AP News: జల్లికట్టులో విషాదం
ABN , First Publish Date - 2022-08-13T19:58:12+05:30 IST
జిల్లాలోని గుడిపాల మండలంలోని సి బండపల్లిలో జరిగిన జల్లికట్టులో విషాదం చోటు చేసుకుంది.
చిత్తూరు: జిల్లాలోని గుడిపాల మండలంలోని సి బండపల్లిలో జరిగిన జల్లికట్టు (Jallikattu)లో విషాదం చోటు చేసుకుంది. జల్లికట్టులో ఎద్దులను నివారించే క్రమంలో ఎద్దు పొడవడంతో ఒకరు మృతి చెందగా... పలువురికి గాయాలయ్యాయి. విషాద అనంతరం జల్లికట్టును పోలీసులు మధ్యలోనే నిలిపివేశారు. ముట్టుకురుపల్లి గ్రామానికి చెందిన వెంకటేశ్ మందడి మృతి చెందాడు. తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరికి చెందిన మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.