కుప్పంలో Tension.. Tension
ABN , First Publish Date - 2022-08-25T16:52:58+05:30 IST
కుప్పంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు(TDP chief Chandrababu Naidu) ప్రారంభించాల్సిన అన్నాక్యాంటిన్
Chittoor: కుప్పంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు(TDP chief Chandrababu Naidu) ప్రారంభించాల్సిన అన్నాక్యాంటిన్(Annacantin) దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. చంద్రబాబుకు వ్యతిరేకంగా వైసీపీ(YCP) శ్రేణులు నిరసనకు దిగారు. కుప్పంలో చంద్రబాబు పర్యటన నేపథ్యంలో టీడీపీ(TDP) కార్యకర్తలు ఏర్పాటు చేసిన ప్లెక్సీలను.. వైసీపీ కార్యకర్తలు చించివేశారు. అలాగే ప్యాలెస్ రోడ్డులో ఉన్న తెలుగుదేశానికి సంబంధించిన బ్యానర్లు, కౌటౌట్లు ధ్వంసం చేశారు. దీంతో కుప్పంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మరోవైపు చంద్రబాబు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న వైసీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఆందోళన చేస్తున్న వైసీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు.
ఇక.. సొంత నియోజకవర్గం కుప్పంలో చంద్రబాబు మూడ్రోజుల పర్యటన బుధవారం ప్రారంభమైంది. తొలి రోజు రామకుప్పం మండలంలోని కొంగనపల్లె, కొళ్లుపల్లె, శివునికుప్పం, చల్దిగానిపల్లెల్లో పర్యటించారు. నేడు గురువారం కుప్పంలోని అన్న క్యాంటీన్ను పరిశీలించి, టీడీపీ కార్యాలయాన్ని మరికాసేపట్లో ప్రారంభించనున్నారు.