చిత్తూరులో టీడీపీ నేతల పాదయాత్ర భగ్నం

ABN , First Publish Date - 2020-10-26T14:35:47+05:30 IST

కుప్పం నియోజకవర్గంలో హంద్రీనీవా ప్రాజెక్టును పూర్తిచేయాలని టీడీపీ నేతలు చేపట్టిన పాదయాత్రను పోలీసులు భగ్నం చేశారు.

చిత్తూరులో టీడీపీ నేతల పాదయాత్ర భగ్నం

చిత్తూరు: కుప్పం నియోజకవర్గంలో హంద్రీనీవా ప్రాజెక్టును పూర్తిచేయాలని టీడీపీ నేతలు చేపట్టిన పాదయాత్రను  పోలీసులు భగ్నం చేశారు. జిల్లాలో ఎక్కడికక్కడ  టీడీపీ ముఖ్య నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు. పలమనేరులో మాజీ మంత్రి అమర్నాథరెడ్డిని  పోలీసులు గృహనిర్బంధం చేశారు. కుప్పంలో ఎమ్మెల్సీ గౌని వారి శ్రీనివాసులు , రామకుప్పం మండలంలో టీడీపీ మండలాధ్యక్షుడు అంజినేయరెడ్డి, మండల ఇన్‌చార్జి మునస్వామిలతో పాటూ పలువురు నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. నాలుగు రోజులు పాదయాత్రకు టీడీపీ సిద్ధమైన నేపథ్యంలో వ్యతిరేకంగా వైసీపీ కూడా ఆందోళనకు సిద్ధమైంది. దీంతో కుప్పానికి భారీ సంఖ్యలో పోలీసు బలగాలు చేరుకున్నాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

Updated Date - 2020-10-26T14:35:47+05:30 IST