చలో ఐటీడీఏను జయప్రదం చేయాలి
ABN , First Publish Date - 2021-10-17T06:05:32+05:30 IST
ప్రభు త్వ వెబ్సైట్ నుంచి ఎస్టీ వాల్మీకి, భగత ఉప కులాలను తొలగించిన వారిపై అట్రా సిటీ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 22న నిర్వహించనున్న చలో ఐటీడీఏ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.అప్పలనర్స కోరారు.
గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అప్పలనర్స
ముంచంగిపుట్టు, అక్టోబరు 16: ప్రభు త్వ వెబ్సైట్ నుంచి ఎస్టీ వాల్మీకి, భగత ఉప కులాలను తొలగించిన వారిపై అట్రా సిటీ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 22న నిర్వహించనున్న చలో ఐటీడీఏ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.అప్పలనర్స కోరారు. శనివారం చలో ఐడీడీఏ కార్యక్రమం పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజన హక్కులు, చట్టాలను పక్కాగా అమలు చేయాలనిడిమాండ్ చేశారు. ప్రభుత్వ వెబ్సైట్ నుంచి ఆదివాసీ ఉపకులాలను తొలగించడం అన్యాయమన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం, యూటీఎఫ్ నాయకులు ఎం.ధర్మారావు, కూడా శ్రీనివాసమూర్తి, కె.త్రినాథ్, పి.సత్యనారాయణ, ఎస్.దొన్నో పాల్గొన్నారు.