సీహెచ్‌వోలకు పదోన్నతులు కల్పించాలి

ABN , First Publish Date - 2022-07-07T05:27:38+05:30 IST

పీహెచ్‌సీ పరిధిలో కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్లు(సీహెచ్‌వో)గా విధులు నిర్వహిస్తూ గ్రేడ్‌-1, గ్రేడ్‌-2 కొలువుల కోసం ఎదురుచూస్తున్న వారికి పదోన్నతులు కల్పించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసెస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు వినుకొండ రాజారావు కోరారు.

సీహెచ్‌వోలకు పదోన్నతులు కల్పించాలి
రీజినల్‌ డైరక్టర్‌ విజయగౌరికి వినతిపత్రం అందజేస్తున్న వినుకొండ రాజారావు తదితరులు

ఆర్డీకి ఉద్యోగసంఘ నాయకుల వినతి

గుంటూరు(తూర్పు), జూలై 6: పీహెచ్‌సీ పరిధిలో కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్లు(సీహెచ్‌వో)గా విధులు నిర్వహిస్తూ గ్రేడ్‌-1, గ్రేడ్‌-2 కొలువుల కోసం ఎదురుచూస్తున్న వారికి పదోన్నతులు కల్పించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసెస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు వినుకొండ రాజారావు కోరారు. ఈమేరకు వైద్య, ఆరోగ్యశాఖ ప్రాంతీయ సంచాలకులు విజయగౌరిని కలసి బుధవారం వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తక్షణమే కమిటీ సమావేశం ఏర్పాటు చేసి పదోన్నతులపై నిర్ణయించి ప్రభుత్వానికి నివేదిక పంపాలని విజ్ఞప్తి చేశారు. వినతిపత్రం అందజేసిన వారిలో సంఘ నాయకులు మచ్చా నాగరాజు, రాజశేఖర్‌, మోహన్‌, శివప్రసాదు, మోహనబాబు, బాలాజీ, గంగరాజు, రాజ్‌కుమార్‌ తదితరులు ఉన్నారు. 


Updated Date - 2022-07-07T05:27:38+05:30 IST