జాతీయ స్థాయి యోగా పోటీల్లో చోడవరం విద్యార్థులకు పతకాల పంట
ABN , First Publish Date - 2022-08-13T06:38:53+05:30 IST
జాతీయ స్థాయి ఆన్లైన్ యోగా పోటీల్లో స్థానిక విద్యార్థులు పతకాలు సాధించి సత్తా చాటారు.
చోడవరం, ఆగస్టు 12: జాతీయ స్థాయి ఆన్లైన్ యోగా పోటీల్లో స్థానిక విద్యార్థులు పతకాలు సాధించి సత్తా చాటారు. బెంగళూరు శివజ్యోతి యోగ కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి ఆన్లైన్ యోగా పోటీల్లో స్థానిక పతంజలి యోగ కేంద్రం విద్యార్థులు 15 మంది వివిధ కేటగిరీలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించారు. జాతీయ స్థాయి పోటీలలో పతకాలు సాధించిన విద్యార్థులను యోగా కేంద్రం గౌరవాధ్యక్షులు పప్పల రమణమూర్తి, చైర్మన్ పసుమర్తి అశోక్, ఉషోదయ విద్యాసంస్థల చైర్మన్ జెర్రిపోతుల రమణాజీ, వాసవీక్లబ్ చైర్మన్ పూసర్ల సతీష్ అభినందించారు. పోటీలలో 15మంది పతకాలు సాధించడపై పతంజలి యోగ కేంద్రం డైరెక్టర్ పుల్లేటి సతీష్ ఆనందం వ్యక్తం చేశారు.