మాజీ సైనికుని ఇంట్లో చోరీ

ABN , First Publish Date - 2021-04-23T06:25:09+05:30 IST

పట్టణంలోని ఓ మాజీ సైనికుని ఇంట్లో చోరీ జరిగింది. సుమారు రూ.3.50 లక్షల మేర బంగారు, వెండి ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లారు.

మాజీ సైనికుని ఇంట్లో చోరీ

7 తులాల బంగారు, 30 తులాల వెండి అపహరణ

క్లూస్‌ టీమ్‌ పరిశీలన

గిద్దలూరు టౌన్‌, ఏప్రిల్‌ 22 : పట్టణంలోని ఓ మాజీ సైనికుని ఇంట్లో చోరీ జరిగింది. సుమారు రూ.3.50 లక్షల మేర బంగారు, వెండి ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లారు. పోలీసుల కథనం మేరకు పట్టణంలోని రాజానగర్‌లో నివాసం ఉంటున్న మాజీ సైనిక ఉద్యోగి మూలవెంకటరామిరెడ్డి తిరునాళ్ల సందర్భంగా సొంత గ్రామానికి బుధవారం వెళ్లారు. గురువారం ఉదయం తిరిగి ఇంటికి వచ్చేసరికి తలుపులు పగులగొట్టి ఉండడం గమనించాడు. ఇరుగుపొరుగు వారిని పిలిచి ఇంటిలోని పరిసరాలను పరిశీలించగా బీరువా తెరిచి ఉంది. వెంటనే ఎస్‌ఐ రవీంద్రరెడ్డికి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న ఎస్‌ఐ రవీంద్రరెడ్డి దొంగతనం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. 7 తులాల బంగారు నగలు, 30 తులాల వెండి చోరీకి గురైనట్లు వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. క్లూస్‌ టీమ్‌ సభ్యులు గురువారం దొంగతనం జరిగిన ప్రాంతంలో ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రవీంద్రరెడ్డి తెలిపారు.

Updated Date - 2021-04-23T06:25:09+05:30 IST