చోరీ ఘటనపై ముమ్మర దర్యాప్తు : సీఐ

ABN , First Publish Date - 2020-11-29T05:46:46+05:30 IST

త్రిపురవరంలో శుక్రవారం రాత్రి జరిగిన చోరీ ఘటనపై విచారణ ముమ్మరంగా చేస్తున్నామని సీఐ శివశంకర్‌గౌడ్‌ అన్నారు.

చోరీ ఘటనపై ముమ్మర దర్యాప్తు : సీఐ
ఆధారాలను సేకరిస్తున్న క్లూస్‌టీం

నడిగూడెం, నవంబరు 28 : త్రిపురవరంలో శుక్రవారం రాత్రి జరిగిన చోరీ ఘటనపై విచారణ ముమ్మరంగా చేస్తున్నామని సీఐ శివశంకర్‌గౌడ్‌ అన్నారు. చోరీకి గురైన యాద కృష్ణమూర్తి ఇంటిని శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ యాద కృష్ణమూర్తి తన తమ్ముడి కుమారుడి వివాహానికి కుటుంబంతో కృష్ణా జిల్లాలోని పెనుగంచిప్రోలుకు గురువారం వెళ్లారని ; శుక్రవారం ఇంటికి వచ్చి చూసే సరికి తాళాలు పగులగొట్టి ఉండటంతో పోలీసులకు సమాచారం అందించారని తెలిపారు. పోలీసులు విచారణలో 8 తులాల బంగారం, 4 కేజీల వెండి, రూ.20 వేల నగదు, కిరాణ సామగ్రి చోరీకి గురైనట్లు బాధితుడు తెలిపాడని సీఐ వివరించారు. క్లూస్‌ టీం ఆధ్వర్యంలో ఆధారాలు సేకరిస్తున్నామని ; బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

Updated Date - 2020-11-29T05:46:46+05:30 IST