చిత్తూరులో టీడీపీ శ్రేణులపై పోలీసుల లాఠీఛార్జ్
ABN , First Publish Date - 2021-11-20T18:14:10+05:30 IST
జిల్లాలో టీడీపీ శ్రేణులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
చిత్తూరు: జిల్లాలో టీడీపీ శ్రేణులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నిన్నటి రోజు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడుపై వైసీపీ నేతలు ప్రవర్తించిన తీరుకు నిరసనగా జిల్లాలోటీడీపీ శ్రేణులు ధర్నాకు దిగారు. గాంధీ విగ్రహం వద్ద రోడ్డుపై చేపట్టిన ధర్నాను పోలీసులు అడ్డుకున్నారు. ఇరువురి మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఎమ్మెల్సీ దొరబాబు, జిల్లా టీడీపీ అధ్యక్షులు పులివర్తి నాని, మాజీ మేయర్ కటారి హేమలత, టీడీపీ ఉపాధ్యక్షులు కాజూరు బాలాజీతో సహా పలువురు ముఖ్య నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.