చుక్కలదుప్పిని చంపిన ఐదుగురి అరెస్టు
ABN , First Publish Date - 2020-12-03T05:17:36+05:30 IST
చుక్కల దుప్పిని చంపిన ఘటనలో బుధవారం ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఇచ్చోడ టైగర్జోన్ ఎఫ్ఆర్వో వాహెద్ అహ్మద్ తెలిపారు.
ఇచ్చోడ రూరల్, డిసెంబరు 2: చుక్కల దుప్పిని చంపిన ఘటనలో బుధవారం ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఇచ్చోడ టైగర్జోన్ ఎఫ్ఆర్వో వాహెద్ అహ్మద్ తెలిపారు. ఎర్రచెల్మ గ్రామ శివారులో చుక్కల దుప్పిని చంపిన సంఘఘటనలో పట్ల మహేష్, అరేసురేష్, అరే.రాజన్న, పిట్ల వెంకట్, ఆరె.ఎల్లయ్యలను అరెస్టు చేసి కేసు నమోదు చేసి రిమాండ్కు తరించినట్లు పేర్కొన్నారు.