AP News: టీడీపీ, టీఎన్ఎస్ఎఫ్ నేతలుపై సీఐ దౌర్జన్యం
ABN , First Publish Date - 2022-08-25T22:08:04+05:30 IST
AP News: టీడీపీ, టీఎన్ఎస్ఎఫ్ నేతలుపై సీఐ దౌర్జన్యం
Anantapuram: అనంతపురం రూరల్ మండల పరిధిలోని పాపంపేటలో అనంతపురం రూరల్ సీఐ (CI) విజయ భాస్కర్ గౌడ్ వివాదాస్పదమవుతుంది. కుప్పంలో చంద్రబాబు పర్యటన సందర్భంగా టీడీపీ నేతలపై వైసీపీ కార్యకర్తలు దాడిని నిరసిస్తూ కళ్యాణదుర్గం బైపాస్లో ఆందోళనకు దిగారు. టీడీపీ(TDP), టీఎన్ఎస్ఎఫ్ నేతలుపై సీఐ విజయ భాస్కర్ గౌడ్ విరుచుకుపడ్డారు. సీఐ టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి పరశురామ్ను కాలర్ పట్టుకుని ఈడ్చుకెళ్లారు. దీంతో పోలీసుల చర్యలను నిరసిస్తూ.. సీపీ దాడిని ఖండిస్తూ కళ్యాణదుర్గం బైపాస్లో టీడీపీ, టీఎన్ఎస్ఎఫ్ నేతలు ఆందోళనకు దిగారు. సీఐ ఎవరి అనుమతితో నిరసన వ్యక్తం చేస్తున్నారని టిడిపి నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్పీతో అనుమతి తీసుకున్న తర్వాతే ఇక్కడ నిరసన వ్యక్తం చేయాలంటూ సీఐ హుకుం జారీ చేశారు.