ఇంటి ముందు సిగరెట్ తాగొద్దన్నాడని...!
ABN , First Publish Date - 2021-07-17T17:29:35+05:30 IST
తన ఇంటి ముందు ధూమపానం చేయవద్దని అన్నందుకు
హైదరాబాద్ సిటీ/బోయిన్పల్లి : తన ఇంటి ముందు ధూమపానం చేయవద్దని అన్నందుకు ఓ వ్యక్తి రాయితో కొట్టి గాయపరిచిన సంఘటన బోయినపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం సిక్ విలేజ్కు చెందిన ముత్తుస్వామి వ్యాపారి. శుక్రవారం మధ్యాహ్నం ముత్తుస్వామి ఇంటి ముందు కూర్చున్నాడు. అదే సమయంలో స్థానికంగా నివసించే ఆండ్ర్యూ అక్కడకు వచ్చి ధూమపానం చేస్తున్నాడు. ఇక్కడ ధూమపానం చేయవద్దని ముత్తు ఆండ్ర్యూకు చెప్పాడు. కోపోద్రిక్తుడైన ఆండ్ర్యూ, అతడి తమ్ముడు జేమ్స్ ముత్తూతో గొడవపడ్డారు. రాయితో దాడి చేయడంతో ముత్తు పన్ను విరిగింది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.