టిప్పర్ను ఢీకొని ఇద్దరి మృతి
ABN , First Publish Date - 2021-07-26T06:56:52+05:30 IST
రోడ్డు పక్క ఆగివున్న టిప్పర్ను వెనుక నుంచి స్కూటీ ఢీ కొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు.
హయత్నగర్,జూలై 25(ఆంధ్రజ్యోతి): రోడ్డు పక్క ఆగివున్న టిప్పర్ను వెనుక నుంచి స్కూటీ ఢీ కొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు. జనగాం జిల్లా స్టేషన్ఘనపుర్కు చెం దిన మోటం మస్తాన్ (35), మోటం చంద్ర య్య(57) అబ్దుల్లాపూర్మెట్ వద్ద గుడి సెల్లో నివసిస్తూ చెట్ల మందులు, చేతి ఉంగరాలు విక్రయిస్తుంటారు. ఆదివారం హయత్నగర్కు వచ్చిన వారు పని ముగించుకుని అబ్దుల్లాపూర్మెట్ వైపునకు స్కూటీపై లక్ష్మారెడ్డి పాలెం వద్ద జాతీయ రహదారి పక్కన ఆగివున్న టిప్పర్ను వెనుక నుంచి ఢీ కొట్టారు. ప్రమాదంలో మస్తాన్ అక్కడిక్కడే మృతి చెందాడు, గాయాలకు గురైన చంద్రయ్యను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడని ఎస్ రాజు తెలిపారు.