సంక్షేమబోర్డును ఏర్పాటు చేయాలి : సీఐటీయూ
ABN , First Publish Date - 2020-10-25T11:10:00+05:30 IST
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హమాలీ కార్మికులకు సంక్షేమబోర్డును ఏర్పాటుచేసి వారిని ఆదుకోవాలని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు గడ్డం వెంకటేష్ డిమాండ్చేశారు
భూదాన్పోచంపల్లి, అక్టోబరు 24: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హమాలీ కార్మికులకు సంక్షేమబోర్డును ఏర్పాటుచేసి వారిని ఆదుకోవాలని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు గడ్డం వెంకటేష్ డిమాండ్చేశారు. శనివారం భూదాన్పోచంపల్లిలో జరిగిన హమాలీ కార్మికుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మిక సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాల్సిన ప్రభుత్వాలు, అందుకు విరుద్దంగా వ్యవహరిస్తున్నాయన్నారు. సైదుగాని లచ్చయ్య, చింతల లక్ష్మయ్య, కిష్టయ్య, వెంకటేష్, అంజయ్య, సైదులు పాల్గొన్నారు.