ఆటో నగర్‌ సాధనే సీఐటీయూ లక్ష్యం

ABN , First Publish Date - 2022-09-26T04:47:03+05:30 IST

రాజం పేట పట్టణంలో ఆటో నగర్‌ సాధనే లక్ష్యంగా సీఐటీయూ పనిచేస్తోందని ఆ సంఘం జిల్లా కార్యదర్శి రవి కుమార్‌ తెలిపారు.

ఆటో నగర్‌ సాధనే సీఐటీయూ లక్ష్యం
సమావేశంలో ప్రసంగిస్తున్న సీఐటీయూ జిల్లా కార్యదర్శి రవికుమార్‌

రాజంపేట, సెప్టెంబరు 25: రాజం పేట పట్టణంలో ఆటో నగర్‌ సాధనే లక్ష్యంగా సీఐటీయూ పనిచేస్తోందని ఆ సంఘం జిల్లా కార్యదర్శి రవి కుమార్‌ తెలిపారు. ఆదివారం ఎన్జీ వో హోంలో జరిగిన ఆటో, లారీ, వె ల్డింగ్‌ వర్కర్స్‌, ఎలక్ట్రికల్‌, జీపు, ద్వి చక్ర వాహన మెకానిక్‌ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ ఆటో నగర్‌ ఏర్పాటు కు 20 ఏళ్లుగా పోరాడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి నరసింహ, ఆటో నగర్‌ సాధన కమిటీ కన్వీనర్‌ పెద్దబాబు, కమిటీ సభ్యులు సుభాన్‌, ఖలీల్‌, వెంకటరెడ్డి, రఫీ, కోటయ్య, సతీష్‌, హరినాధ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-26T04:47:03+05:30 IST