MBBS చదువుకునే యువతిని ప్రేమించిన యువకుడు.. తన ప్రియుడు కనబడడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన యువతి.. అసలు ఏం జరిగిందంటే..
ABN , First Publish Date - 2022-02-18T05:54:02+05:30 IST
MBBS చదువుకునే ఒక యువతి తన హాస్టల్ పరిసరాల్లో ఉండే ఒక యువకుడిని ప్రేమించింది. ఇద్దరూ సంతోషంగా ఉండేవారు. ఒక్కసారిగా ఆ యువకుడు కనబడకుండా పోయాడు. ప్రియుడి కోసం ఎంత వెతికినా కనబడకపోవడంతో..
MBBS చదువుకునే ఒక యువతి తన హాస్టల్ పరిసరాల్లో ఉండే ఒక యువకుడిని ప్రేమించింది. ఇద్దరూ సంతోషంగా ఉండేవారు. ఒక్కసారిగా ఆ యువకుడు కనబడకుండా పోయాడు. ప్రియుడి కోసం ఎంత వెతికినా కనబడకపోవడంతో.. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఫోన్ లొకేషన్ ఆధారంగా యువకుడి ఆచూకీ తెలుసుకున్నారు. ఇంతకీ ఆ యువకుడు ఏ స్థితిలో ఉన్నాడంటే..
దేశ రాజధాని ఢిల్లీకి చెందిన షాలు(24, పేరు మార్చబడినది) అనే యువతి MBBS చివరి సంవత్సరం చదువుకుంటోంది. కాలేజీ ఇంటి నుంచి దూరంగా ఉండడంతో షాలు హాస్టల్లో ఉంటోంది. హాస్టల్ సమీపంలో రజనీష్ శర్మ అనే యువకుడు IAS పరీక్షల కోసం శిక్షణ తీసుకుంటున్నాడు. శిక్షణ కొనసాగిస్తూనే రజనీష్ .. ఒక చిన్న ఉద్యోగం కూడా చేసేవాడు.
షాలు, రజనీష్ ఇద్దరూ మెట్రో స్టేషన్లో కలిశారు. ఆ తరువాత తరుచూ కలిస్తూ ఉండేవారు. అలా వారిద్దరూ ప్రేమించుకున్నారు. ఒకరోజు షాలుని పార్టీ పేరుతో రజనీష్ తన స్నేహితుడి గదికి తీసుకపోయాడు. కానీ అక్కడ ఏ పార్టీ జరగడం లేదు. గదిలోకి షాలుని తీసుకుపోయాక రజనీష్ ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ తరువాత త్వరలోనే ఆమెను వివాహం చేసుకుంటానని నమ్మించాడు. అలా కొంతకాలం షాలుని మోసం చేసి ఆమెతో శృంగారం చేశాడు. ఒకరోజు షాలు గర్భవతి అని తెలిసింది. ఆ తరువాత షాలు తనను వివాహం చేసుకోవాల్సిందే రజనీష్పై ఒత్తిడి చేసింది. మరుసటి రోజు నుంచి రజనీష్ కనబడకుండా పోయాడు.
రజనీష్ తనను మోసం చేసి ఎక్కడికో వెళ్లిపోయాడంటూ షాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు రజనీష్ చివరి ఫోన్ లొకేషన్ ట్రాక చేయగా.. అతను రాజస్థాన్ రాజధాని జైపూర్లో ఉన్నట్లు తెలిసింది. వెంటనే పోలీసుల బృందం జైపూర్ వెళ్లి రజనీష్ని అరెస్టు చేసింది.
పోలీసులు రజనీష్ని అత్యాచారం, చీటింగ్ కేసులో అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.