తెలంగాణ సీఎస్‌పై సీజేఐ ఎన్వీ రమణ ఆగ్రహం

ABN , First Publish Date - 2022-04-30T21:28:15+05:30 IST

తెలంగాణ సీఎస్‌పై సీజేఐ ఎన్వీ రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు.తెలంగాణలో న్యాయవ్యవస్థ సమస్యలను సీఎం, హైకోర్టు సీజే పరిష్కరించాలన్నారు.

తెలంగాణ సీఎస్‌పై సీజేఐ ఎన్వీ రమణ ఆగ్రహం

ఢిల్లీ: తెలంగాణ సీఎస్‌పై సీజేఐ ఎన్వీ రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు.తెలంగాణలో న్యాయవ్యవస్థ సమస్యలను సీఎం, హైకోర్టు పరిష్కరించాలన్నారు. నిర్ణయాలను అమలు చేయకుండా సీఎస్‌ని పెండింగ్‌లో ఉంచడంపై మండిపడ్డారు. ఈ అంశాలను న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పరిశీలిస్తారన్నారు. తమ వ్యక్తిగత పనుల కోసం అడగడం లేదని న్యాయవ్యవస్థ బలోపేతానికే నిర్ణయాలు తీసుకుంటున్నామని సీజేఐ తెలిపారు. కోర్టుల్లో దయనీయమైన పరిస్థితులున్నాయని సీజేఐ ఎన్వీ రమణ ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కోర్టుల్లో ఒక న్యాయవాది కోర్టు హాల్‌లోకి వెళ్లి..వెనక్కి వస్తే తప్ప మరొకరు వచ్చే పరిస్థితి లేదేని సీజేఐ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. 



Updated Date - 2022-04-30T21:28:15+05:30 IST