95 శాతం మేనిఫెస్టో అమలు చేశామని చెప్పడం అబద్ధం: Yanamala
ABN , First Publish Date - 2022-07-09T00:45:01+05:30 IST
విజయవాడ: జగన్ ప్రభుత్వంపై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గుంటూరులో జరుగుతున్న వైసీపీ ప్లీనరి సమావేశాల నేపథ్యంలో యనమల ఇలా మాట్లాడారు.
విజయవాడ: జగన్ ప్రభుత్వంపై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గుంటూరులో జరుగుతున్న వైసీపీ ప్లీనరి సమావేశాల నేపథ్యంలో యనమల ఇలా మాట్లాడారు.
ఆ డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయి?
‘‘నవరత్నాల పేరుతో జగన్ ప్రజలను మోసగిస్తున్నాడు. సంక్షేమ పథకాల కోసం ఖర్చు చేసింది రూ.లక్షా 50 వేల కోట్లు కాగా అప్పుగా తెచ్చిన రూ.5 లక్షల కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లాయి? వైసీపీ ప్లీనరీలో ఆత్మస్తుతి పరనింద తప్ప ప్రజాప్రయోగం లేదు. ప్లీనరీ కోసం ప్రజాధనం, ప్రభుత్వ యంత్రాంగం దుర్వినియోగం చేశారు. ప్లీనరీలో నిత్యావసరాల ధరల పెరుగుదల, పన్నుల పెంపు, సంపూర్ణ మధ్య నిషేధం, ఉద్యోగాల భర్తీ, మహిళలపై పెరిగిపోతున్న అఘాయిత్యాల గురించిన ప్రస్తావనే లేదు. 95 శాతం మేనిఫెస్టో అమలు చేశామని చెప్పడం పూర్తి అబద్దం’’ అని యనమల పేర్కొన్నారు.