క్లాప్ ఆటో డ్రైవర్లకు జీతాలు చెల్లించాలి
ABN , First Publish Date - 2022-08-20T05:00:48+05:30 IST
మున్సి పల్ పరిధిలో చెత్త సేకర ణ క్లాప్ ఆటో డ్రైవర్లకు వెంటనే జీతాలు చెల్లించాలని ఏఐటీయూ సీ రాష్ట్ర సమితి సభ్యుడు సాంబ శివ, మున్సిపల్ వర్కర్స్ యూని యన్ నాయకుడు సురేష్కుమార్ డి మాండ్ చేశారు.
మదనపల్లె అర్బన్, ఆగస్టు 19: మున్సి పల్ పరిధిలో చెత్త సేకర ణ క్లాప్ ఆటో డ్రైవర్లకు వెంటనే జీతాలు చెల్లించాలని ఏఐటీయూ సీ రాష్ట్ర సమితి సభ్యుడు సాంబ శివ, మున్సిపల్ వర్కర్స్ యూని యన్ నాయకుడు సురేష్కుమార్ డి మాండ్ చేశారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయం వద్ద ఆటో డ్రైవర్లతో కలిసి నిరసన చేపట్టారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ రెడ్డి ఏజెన్సీ మ్యాన్ ఫవర్ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా ఆటో డ్రైవర్లు పని చేస్తున్నా రూ. 15వేలు చెల్లిస్తామని చెప్పి రూ. 9275 మాత్రమే చెల్లిస్తున్నారన్నారు. ఇచ్చే కొద్దిపాటి జీతాలు మూడు నెల లుగా ఇవ్వకుండా పెండింగ్లో ఉంచారన్నారు. కనీస వేతనం రూ 21 వేలు ఇవ్వాలని, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో షరీఫ్బాషా, బబ్లూ, లింగమూర్తి, బాలాజీ, రామమూర్తి, ఆసీఫ్, రెడ్డిప్రసాద్ పాల్గొన్నారు.