ఎదురాళ్లపాడు గ్రామంలో ఇరువర్గాల ఘర్షణ

ABN , First Publish Date - 2022-06-25T06:24:34+05:30 IST

మండలంలోని ఎదురాళ్లపాడు గ్రామంలో శుక్రవారం రాత్రి ఇరువర్గాల మధ్య ఘర్షణలో ఇద్దరికి గాయాల య్యాయి.

ఎదురాళ్లపాడు గ్రామంలో ఇరువర్గాల ఘర్షణ
దాడిలో గాయపడ్డ టీడీపీ కార్యకర్త ఐతయ్య

ఎదురాళ్లపాడు గ్రామంలో ఇరువర్గాల ఘర్షణ 

పలువురికి గాయాలు 

కొనకనమిట్ల, జూన్‌ 24 : మండలంలోని ఎదురాళ్లపాడు గ్రామంలో శుక్రవారం రాత్రి ఇరువర్గాల మధ్య ఘర్షణలో ఇద్దరికి గాయాల య్యాయి. వివరాల ప్రకారం గ్రామంలో ఇటీవల జరిగిన పోలేరమ్మ తిరునాళ్ల సందర్బంగా డీజే పాటల విషయంమై టీడీపీ- వైసీపీ వర్గీయుల మధ్య స్వల్ప ఘర్షణ జరిగింది. ఇరువర్గాలకు గ్రామస్తులు సర్ధిచెప్పడంతో వెళ్లిపోయారు. అయితే శుక్రవారం రాత్రి పాత గొడవ విషయపై ఇరువర్గాల మధ్య వాదనలు జరిగి కర్రలతో కొట్టుకున్నారు. ఈ గొడవలో టీడీపి కార్యకర్త పోకల ఐతయ్యను వైసీపీ వర్గీయులు కర్రలతో దాడి చేయడంతో ఐతయ్యకు తలకు బలమైన గాయమైంది. యల్లమ్మ, యల్లయ్యలకు స్వల్ప గాయాలయ్యాయి.  వైసీపి వర్గీయులకు స్వల్ప గాయమయినట్లు గ్రామస్తులు తెలిపారు. క్షతగాత్రుడిని 108లో పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. క్షతగాత్రుడు ఐతయ్య వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Updated Date - 2022-06-25T06:24:34+05:30 IST