టీఆర్ఎస్-బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణ
ABN , First Publish Date - 2020-12-01T20:49:46+05:30 IST
పటాన్చెరు డివిజన్లోని చైతన్య స్కూల్ దగ్గర టీఆర్ఎస్-బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణ జరిగింది.
హైదరాబాద్: పటాన్చెరు డివిజన్లోని చైతన్య స్కూల్ దగ్గర టీఆర్ఎస్-బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణ జరిగింది. తమ కార్యకర్తలపై టీఆర్ఎస్ నేతలు దాడి చేశారని బీజేపీ నాయకులు ఆరోపించారు. దీంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. డీఎస్పీ వచ్చి పరిస్థితిని చక్కదిద్దారు.
యాకుత్పురాలో దొంగ ఓట్లు వేసేందుకు మహిళలు ఆటోలో వచ్చారు. వారిని ఎంబీటీ నేతలు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మరోవైపు మాదాపూర్లో ఘర్షణ వాతావరణం నెలకొంది. టీఆర్ఎస్-బీజేపీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు పరస్పరం దాడి చేసుకునే పరిస్థితి నెలకొంది. మాదాపూర్ డివిజన్లో టీఆర్ఎస్ కార్యకర్తలు డబ్బులు పంపిణీ చేస్తున్నప్పటికీ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయలేదని బీజేపీ కార్యకర్తలు ఆరోపిస్తూ ఆందోళన చేశారు. ఇలాగే దాదాపు 10 ప్రదేశాల్లో టీఆర్ఎస్-బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరిగాయి. ప్రస్తుతం ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరుగుతోంది.