తల్లిపై ప్రేమతో తన సీనియర్‌ని పొడిచి చంపిన 10వ తరగతి విద్యార్థి

ABN , First Publish Date - 2021-10-03T12:07:49+05:30 IST

దేశ రాజధాని ఢిల్లీలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో ఓ 10వ తరగతి విద్యార్థి తన సీనియర్(11వ తరగతి చదివే విద్యర్థి)ని కత్తితో పొడిచి చంపాడు. నిందితుడిని పోలీసులు తక్షణమే అరెస్టు చేశారు. ఆ చిన్న వయస్సులో ఇంత పెద్ద గొడవ దేనికొచ్చిందని పోలీసులు విచారణ చేశారు. విచారణలో తేలిని నిజమేమిటంటే..

తల్లిపై ప్రేమతో తన సీనియర్‌ని పొడిచి చంపిన 10వ తరగతి విద్యార్థి

దేశ రాజధాని ఢిల్లీలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో ఓ 10వ తరగతి విద్యార్థి తన సీనియర్(11వ తరగతి చదివే విద్యార్థి)ని కత్తితో పొడిచి చంపాడు. నిందితుడిని పోలీసులు తక్షణమే అరెస్టు చేశారు. ఆ చిన్న వయస్సులో ఇంత పెద్ద గొడవ దేనికొచ్చిందని పోలీసులు విచారణ చేశారు. విచారణలో తేలిని నిజమేమిటంటే..


పోలీసుల కథనం ప్రకారం.. ఈ ఘటన అక్టోబర్ 1న జరిగింది. నిందితుడు, మ‌ృతుడు ఇద్దరూ ఢిల్లీలోని ఓఖ్లా ప్రాంతంలో ఒక ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేవారు. మ‌ృతుడు నిందితుడి తల్లిని తిట్టాడు.  దాని తరువాత నిందితుడు.. "మా అమ్మంటే నాకు చాలా ఇష్టం, మా అమ్మను తిట్టొద్దు.. వెంటనే సారీ చెప్పు?" అని అడిగాడు. దానికి మ‌ృతుడు "నేను చెప్పను.. ఏ చేస్తావ్" అని అన్నాడు. ఆ సమయంలో వారిద్దరూ స్కూల్ బయట ఉన్నారు. చుట్టూ ఎవరూ ఆపేవారు లేకపోవడంతో నిందితుడు మ‌ృతుడిని మూడు సార్లు కత్తితో పొడిచాడు. 


సంఘటన జరిగిన వెంటనే చుట్టూ ఉన్నవారు పాఠశాలలో ఉపాధ్యాయులకు విషయం తెలియజేశారు. వారు వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లగా అతను అప్పటికే మ‌ృతి చెందాడని డాక్టర్లు చెప్పారు. పోలీసులు నిందితుడిపై హత్యా నేరం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్తారు.

Updated Date - 2021-10-03T12:07:49+05:30 IST