Rajasthanలో పాఠశాల బాలికపై అత్యాచారం

ABN , First Publish Date - 2022-01-27T13:33:17+05:30 IST

ఓ పాఠశాల బాలికను కిడ్నాప్ చేసి, అటవీప్రాంతంలో ఆమెపై అత్యాచారం చేసి వదిలిపెట్టిన ఘటన...

Rajasthanలో పాఠశాల బాలికపై అత్యాచారం

జైపూర్ : ఓ పాఠశాల బాలికను కిడ్నాప్ చేసి, అటవీప్రాంతంలో ఆమెపై అత్యాచారం చేసి వదిలిపెట్టిన ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని దుంగార్ పూర్ జిల్లాలో వెలుగుచూసింది. బిచివారా గ్రామానికి చెందిన ఓ బాలిక తన సోదరుడితో కలిసి పాఠశాలకు వెళ్లింది. భోజన విరామ సమయంలో బాలిక బయటకు రాగా, 12వతరగతి చదివే ఓ విద్యార్థి బాలికను బలవంతంగా మోటారుసైకిలుపై ఎక్కించుకొని అటవీప్రాంతానికి తీసుకువెళ్లి ఆమెపై గంటల తరబడి అత్యాచారం చేశాడు. అనంతరం అమ్మాయిని ఆమె ఇంటి వద్ద వదిలేశాడు.అత్యాచారానికి గురైన బాలికకు తీవ్ర రక్తస్రావం కావడంతో కుటుంబసభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. 



బాధిత బాలిక తండ్రి ఫిర్యాదు మేర పోలీసులు నిందితుడిపై ఐపీసీ, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ప్రధాన నిందితుడిని, అదే పాఠశాలలో చదువుతున్న అతని స్నేహితుడిని అదుపులోకి తీసుకున్నారు. డీఎస్పీ రాకేష్ కుమార్ శర్మ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-01-27T13:33:17+05:30 IST