న్యాయవాద దంపతుల హత్య కేసులో రామగిరి పోలీసులకు క్లీన్ చిట్!
ABN , First Publish Date - 2021-03-01T09:59:51+05:30 IST
న్యాయవాద దంపతులు వామనరావు, నాగమణి హత్య కేసులో స్థానిక రామగిరి పోలీసుల ప్రమేయం లేదని ఉన్నతాధికారులు క్లీన్ చిట్ ఇచ్చారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): న్యాయవాద దంపతులు వామనరావు, నాగమణి హత్య కేసులో స్థానిక రామగిరి పోలీసుల ప్రమేయం లేదని ఉన్నతాధికారులు క్లీన్ చిట్ ఇచ్చారు. జంట హత్యల వెనుక స్థానిక పోలీసుల పరోక్ష సహకారం ఉందని మొదట్లో పెద్ద ఎత్తున ఆరోపణలొచ్చాయి. దీంతో డీజీ పీ మహేందర్ రెడ్డి స్పందించి ఐజీ నేతృత్వంలో అం తర్గత విచారణ జరిపించారు. ఉన్నతాధికారుల విచారణలో హత్య కేసు నిందితులకు స్థానిక పోలీసుల నుంచి ఎలాంటి సహకారం, సంబంధం లేదని నిగ్గు తేల్చారు.అయితే, ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కేసు దర్యాప్తు నుంచి స్థానిక పోలీసులను దూరం పెట్టారు.