రేపటి నుంచి జ్యువెల్లరీ దుకాణాల బంద్
ABN , First Publish Date - 2021-05-09T03:51:47+05:30 IST
జిల్లా కేంద్రంలో సోమవారం నుంచి 20వ తేదీ వరకు సువర్ణ, రత్న, రజత, ఆభరణ(జ్యువెల్లరి) దుకాణాలు బంద్ చేస్తున్నట్లు ఆ సంఘ అధ్యక్షుడు ముత్యపు ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తెలిపారు.
కామారెడ్డి టౌన్, మే 8: జిల్లా కేంద్రంలో సోమవారం నుంచి 20వ తేదీ వరకు సువర్ణ, రత్న, రజత, ఆభరణ(జ్యువెల్లరి) దుకాణాలు బంద్ చేస్తున్నట్లు ఆ సంఘ అధ్యక్షుడు ముత్యపు ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తెలిపారు. రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నందున కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం వివాహాది శుభాకార్యాల సమయం కావున ప్రజలకు ఏదైనాఅత్యవసరం అయిన వస్తువులు ఇవ్వడానికి ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు ఇవ్వవచ్చని తెలిపారు. ఇచ్చిన వెంటనే దుకాణ సముదాయాలు మూసివేయాలని తెలిపారు. ఈ స్వచ్ఛంద లాక్డౌన్కు ప్రతీ ఒక్క దుకాణదారుడితో పాటు ప్రజలు సహకరించాలని కోరారు.