Batti vikramarka: బీఏసీలో ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు

ABN , First Publish Date - 2022-09-06T20:17:13+05:30 IST

: బీఏసీ (BAC)లో ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (Batti vikramarka) అన్నారు.

Batti vikramarka: బీఏసీలో ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు

హైదరాబాద్: బీఏసీ (BAC)లో ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (Batti vikramarka) అన్నారు. మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడుతూ... అసెంబ్లీ సమావేశాలు (Assembly Session) 20 రోజుల పాటు నిర్వహించాలని బీఏసీలో కోరామన్నారు. అయితే 12,13 తేదీల్లో మాత్రమే నిర్వహిస్తామని ప్రభుత్వం చెబుతోందని తెలిపారు. పని దినాలు కాకుండా.. పని గంటలను పెంచుతామంటోందన్నారు. ముంపు, నిరుద్యోగం, వరదలు, ప్రాజెక్టుల సందర్శనకు వెళ్తున్న ఎమ్మెల్యేల అక్రమ అరెస్ట్ తదితర అంశాలపై చర్చించాలని కోరామని అన్నారు. కనీసం 15, 20 రోజులు సభ జరిగితే చాలా అంశాలు చర్చకు వచ్చేవన్నారు. విభజన హామీలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాట్లాడడం లేదని... దీనిపై మరింత ఎక్కువగా చర్చ జరగాలని భట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు. 

Updated Date - 2022-09-06T20:17:13+05:30 IST