వ్యవసాయాన్ని నిర్వీర్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం
ABN , First Publish Date - 2020-11-29T05:44:08+05:30 IST
కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తుందని సీఐటీయూ నాయకులు కొలిశెట్టి యాదగిరిరావు, నెమ్మాది వెంకటేశ్వర్లు ఆరోపించారు.
సూర్యాపేటటౌన్, నవంబరు 28: కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తుందని సీఐటీయూ నాయకులు కొలిశెట్టి యాదగిరిరావు, నెమ్మాది వెంకటేశ్వర్లు ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని నల్లాలబావి వద్ద కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను శనివారం దహనం చేసి మాట్లాడారు. ఢిల్లీలో రైతులపై లాఠీచార్జి అమానుషమన్నారు. కార్యక్రమంలో నాయకులు వల్లపుదాసు సాయికుమార్, పచ్చిమట్టల పెంటయ్య, ధనియాకుల శ్రీకాంత్వర్మ పాల్గొన్నారు.