డిగ్రీ లెక్చరర్స్ బదిలీలకు సీఎం ఆమోదం
ABN , First Publish Date - 2021-09-08T01:56:51+05:30 IST
రాష్ట్రంలో పని చేస్తున్న డిగ్రీ కాలేజి లెక్చరర్స్ సాధారణ బదిలీలకు అవకాశం
అమరావతి: రాష్ట్రంలో పని చేస్తున్న డిగ్రీ కాలేజి లెక్చరర్స్ సాధారణ బదిలీలకు అవకాశం కల్పించే ప్రతిపాదనకు సీఎం జగన్ ఆమోదం తెలిపారు. 2 సంవత్సరాలు సర్వీసు పూర్తి చేసుకున్నవారు బదిలీలకు అర్హులుగా పేర్కొన్నారు. 5 సంవత్సరాలు సర్వీసును ఓకేచోట పూర్తి చేసుకున్న వారు తప్పని సరిగా బదిలీ కావాల్సిందే. 30-06-2023 లోపల పదవీ విరమణ పొందే వారికి మాత్రం బదిలీ నుంచి మిహాయింపు ఇచ్చారు.