ఎక్కడికెళ్లినా Janatadarshan..

ABN , First Publish Date - 2022-07-22T17:24:06+05:30 IST

ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై రాష్ట్రంలో ఏ జిల్లా పర్యటనకు వెళ్ళినా జనతాదర్శన్‌ కార్యక్రమం నిర్వహిస్తూ ప్రజల సమస్యలను

ఎక్కడికెళ్లినా Janatadarshan..

బెంగళూరు, జూలై 21 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై రాష్ట్రంలో ఏ జిల్లా పర్యటనకు వెళ్ళినా జనతాదర్శన్‌ కార్యక్రమం నిర్వహిస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. రాజధాని బెంగళూరులో ఉన్న సమయంలో ఆయన తన ఆర్‌టీ నగర్‌ నివాసంలోనే జనతాదర్శన్‌ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మండ్య జిల్లా కేఆర్‌ పేట పర్యటనకు గురువారం వెళ్ళిన ఆయన కొద్దిసేపు జనతాదర్శన్‌ కార్యక్రమంలో పాల్గొన్నాకే ముందుకు సాగడం విశేషం. ప్రజలతో మమేకం అయ్యేందుకే సీఎం అధికంగా ఆసక్తి చూపిస్తున్నారు. పలుమార్లు ప్రొటోకాల్‌ను సైతం పక్కకు పెట్టి  సామాన్యులతో పిచ్చాపాటి మాట్లాడుతున్నారు. తనకోసం దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలను అడ్డుకోవద్దని సాధ్యమైనంతవరకు జనతాదర్శన్‌లో పాల్గొని తమ సమస్యలు చెప్పుకునే అవకాశం కల్పించాలని ఆయన తన భద్రతా సిబ్బందికి సైతం సూచించినట్లు తెలుస్తోంది.

Updated Date - 2022-07-22T17:24:06+05:30 IST