బంజారాల ప్రగతికి ప్రాధాన్యం: Cm

ABN , First Publish Date - 2022-02-16T18:06:17+05:30 IST

బడ్జెట్‌లో బంజారాల ప్రగతి, సంక్షేమానికి తగిన ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు ముఖ్యమంత్రి బొమ్మై ప్రకటించారు. బెంగళూరు ఆర్‌టీనగర్‌లోని నివాసంలో మంగళవారం సేవాలాల్‌ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పుష్పాంజలి

బంజారాల ప్రగతికి ప్రాధాన్యం: Cm

బెంగళూరు: బడ్జెట్‌లో బంజారాల ప్రగతి, సంక్షేమానికి తగిన ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు ముఖ్యమంత్రి బొమ్మై ప్రకటించారు. బెంగళూరు ఆర్‌టీనగర్‌లోని నివాసంలో మంగళవారం సేవాలాల్‌ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. సేవాలాల్‌ బంజారాలకు ధర్మగురువుగాను, దారిదీపంగాను సేవలందించారన్నారు. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు బంజారాలు విస్తరించారని, వీరిలో చురుకైన వారు, విద్యావంతులు కూడా ఉన్నారన్నారు. యడియూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బంజారాల ప్రగతికి ఎంతగానో పాటుపడ్డారని తాను కూడా ఇదే విధానాన్ని కొనసాగిస్తున్నట్టు తెలిపారు. వారు కూడా బాధ్యతగా ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు సాధించాలన్నారు. ఈసందర్భంగా కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ ప్రకాశ్‌ రాథోడ్‌ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో బంజారాలు కన్నడ భాషతోపాటు తెలుగును కూడా మాట్లాడుతుంటారని, రాష్ట్రప్రగతిలో ఎంతగానో పాలుపంచుకుంటున్నారని ప్రకాశ్‌రాథోడ్‌ పేర్కొన్నారు. రానున్న కాలంలో వారికి మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు.

Updated Date - 2022-02-16T18:06:17+05:30 IST