CM is busy in Delhi: ఢిల్లీలో సీఎం బిజీ బిజీ
ABN , First Publish Date - 2022-07-26T17:21:30+05:30 IST
నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనేందుకు ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై(Chief Minister
- పలువురు మంత్రులతో చర్చలు
బెంగళూరు, జూలై 25 (ఆంధ్రజ్యోతి): నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనేందుకు ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై(Chief Minister Basavaraj Bommai) సోమవారం పలువురు కేంద్రమంత్రులను కలిశారు. తొలుత కేంద్ర సమాచారశాఖ సహాయ మంత్రి(Minister) లోగనాథన్ మురుగన్తో భేటీ అయి చర్చలు జరిపారు. అనంతరం ఇద్దరూ కలసి ఢిల్లీలోనే ఉన్న గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ను మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర జలవనరులశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ను కలిశారు. ఆయనతో దాదాపు గంటకుపైగా మేకెదాటు, ఆల్మట్టి, ఎగువభద్ర తదితర ప్రాజెక్టులపై చర్చలు జరిపారు. రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి గోవింద కారజోళ కూడా ఈ సందర్భంగా హాజరయ్యారు. ఇదే సందర్భంగా సీఎం, కేంద్ర ఓడరేవులు, ఆయుష్ శాఖల మంత్రి సర్బానంద్ సోనూవాల్ను కలిశారు. శివమొగ్గ(Shivamogga) ఎంపీ బీవై రాఘవేంద్ర, ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి మంజునాథ ప్రసాద్ కూడా వెంట ఉన్నారు. సాయంత్రం ఆయన కేంద్ర పౌర, ఆహార సరఫరాలశాఖ మంత్రి పీయూష్ గోయెల్ను కూడా కలిశారు. ఢిల్లీ పర్యటన సందర్భంగా సీఎం రోజంతా బిజీబిజీగా గడిపారు.