Cm Delhi Tour: మళ్లీ ఢిల్లీకి ముఖ్యమంత్రి

ABN , First Publish Date - 2022-07-24T17:57:44+05:30 IST

రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై మరోసారి ఢిల్లీ(Delhi) వెళుతున్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పదవీ విరమణ సందర్భంగా

Cm Delhi Tour: మళ్లీ ఢిల్లీకి ముఖ్యమంత్రి

                                 - మూడు రోజులు అక్కడే మకాం


బెంగళూరు, జూలై 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై మరోసారి ఢిల్లీ(Delhi) వెళుతున్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పదవీ విరమణ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ(Narendramodi) ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో పాల్గొనేందుకు శుక్రవారం ఢిల్లీ వెళ్లిన సీఎం శనివారం ఉదయం బెంగళూరుకు చేరుకున్నారు. మరోసారి ఆదివారం సాయంత్రం ఆయన ఢిల్లీ వెళుతున్నారు. మూడు రోజులపాటు హస్తినలోనే గడపనున్నారు. ఢిల్లీలో ముఖ్యమంత్రి బస చేస్తున్న తరుణంలో రాష్ట్రానికి సంబంధించి పార్టీ అగ్రనేతలు, కేంద్రంలోని పెద్దలతో చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. సోమవారం(Monday) పార్లమెంటు భవన్‌ సెంట్రల్‌హాల్‌లో రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం చేయనున్నారు. సదరు సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొననున్నారు. దీంతోపాటు బీజేపీ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలోనూ పాల్గొంటారు. బీజేపీ(Bjp) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశం ఉంది. 

Updated Date - 2022-07-24T17:57:44+05:30 IST